G Kishan Reddy

హోంగార్డు రవీందరును పరామర్శించిన కిషన్ రెడ్డి

Spread the love

ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హోంగార్డు రవీందర్ అత్మహత్యాయత్నం దురదృష్టకరం అన్నారు.

హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడి జరుగుతోందన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. హోంగార్డు కొన్ని సార్లు 16 గంటలు పనిచేస్తున్నారన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బందోబస్తు పాల్గొనే హోంగార్డులకు ప్రత్యేక భత్యం ఇవ్వాలన్నారు.

హోంగార్డులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని సీఎం అసెంబ్లీలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హోంగార్డు కుటుంబాలు జీతాలు, అందక రోడ్డున పడుతున్నాయన్నారు..