తెలంగాణలోని కొన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి, వచ్చిన ఫలితాల ఆధారంగానే నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ బృందం పని చేస్తుందని.. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ, వారు తమ బాధ్యతలకు తగినట్లుగా పని చేస్తారనే విశ్వాసం ఉందన్నారు.

తెలంగాణ జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షుల నియామకం
by
Leave a Reply