06 09 2023 Meri Maati Mera Desh Kishan Reddy scaled

‘‘మేరీ మాటి-మేరా దేశ్’’ విజయవంతం చేయండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Spread the love

తెలంగాణలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మట్టిని సేకరించాలని కోరారు. స్వాతంత్ర్యకోసం పోరాడిన మహానేతల ఇండ్లకు వెళ్లి మట్టిని సేకరించాలన్నారు.

అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేట్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. దేశ నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలను ప్రధాని మోదీ ఢిల్లీలో కర్తవ్య పథ్ లో స్వీకరిస్తారని తెలిపారు. ఈ మట్టితో అమర వీరుల స్మారక స్తూపాన్ని నిర్మిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


Posted

in

by