Bandi Sanjay Kumar Speech

కేసీఆర్ మోసకారి పాలనను కూకటి వేళ్ళతో పెకలిద్దాం

Spread the love

బిజెపి ఇందిరాపార్క్ ఉపవాస దీక్ష కార్యక్రమంలో శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ..

ఇంటికి ఒక ఉద్యోగంఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఎవ్వరికీ ఒక రూపాయి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి.

నోటికి ఎంత వస్తే అంత అబద్దాలు ఆడుతాడు. కష్టపడి చదువుకున్న యువత అంతా కూడా నిరుద్యో యువత చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడిపే దుస్థితికి కేసీఆర్ తెచ్చారని అన్నారు. 

ఇవ్వాళ తల్లిదండ్రుల బాధలు చూడలేక, ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని తీవ్రంగా విమర్శించారు. 

మీ గురించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ.. 

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల మరియు ఉన్నత పదవులన్నీ ప్రాంతీయతులైన వేరే రాష్ట్రం నుండి వచ్చిన వారు చేస్తున్నారు.

క్యాబినెట్ కంటే ముఖ్యమంత్రి సహాయ సలహాదారులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అనేకమంది ఇతర రాష్ట్ర అధికారులను తన సలహాదారులుగా పెట్టుకున్న సంగతిని పేర్కొన్నారు.

మళ్లీ మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో, దొంగ ఉద్యోగ నోటిఫికేషన్ లతో  యువతను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి, తెలంగాణ యువత చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తెలంగాణలో నిరుద్యోగ యువతకు కొలువులు రావాలంటే కమలం అధికారంలోకి రావాల్సిందేనని వక్కాణించి చెప్పారు.

భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఉన్నారనేసి తెలిపారు. ఏ ఎన్నికల వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తారని తెలియజేశారు. 

ఈ కుటుంబ టిఆర్ఎస్ పార్టీని, కొత్త రజాకారుల పార్టీని, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, తెలంగాణ ప్రజల బతుకులను బర్బాద్ చేసిన  కెసిఆర్ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలిద్దాం. 

ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామ రాజ్యాన్ని స్థాపించేంతవరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రమించాలని శ్రీ బండి సంజయ్ గారు సభాముఖంగా కోరారు.