WEB 16X9 scaled

గవర్నర్ గారితో డీకే అరుణ భేటీ

Spread the love

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం (సెప్టెంబర్ 8న) రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ పైతో భేటీ అయ్యారు. ఆగస్టు 24వ తేదీన తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా గుర్తించి.. తీర్పు ఇచ్చిందని గవర్నర్ కు వివరించారు. డీకే అరుణ. సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం కూడా గెజిట్ విడుదల చేసిందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని కలిసేందుకు రెండు సార్లు వెళ్తే.. వాళ్లు అందుబాటులో లేరన్నారు. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతోనే తాను గవర్నర్ ను కలవాల్సి వచ్చిందన్నారు. డీకే అరుణ.