అమృత మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నిజాం రజాకార్ల పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తు సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి ‘పరకాల అమర ధామం’ వరకు సాగే ర్యాలీని తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి శ్రీ ప్రకాష్ జవదేకర్ గారు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ రాష్ట్ర బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.