WEB 16X9 1

విమోచన వేడుకలకు అమిత్ షా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ

Spread the love

ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం

ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్

జన సమీకరణపై ఫోకస్

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం: సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమిత్ షా ఓకే. చెప్పడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. నిజానికి ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఈసారి కూడా గతేడాది లెక్కనే పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం ఆధ్వర్యంలో విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్య అతిథిగా కేంద్రం నుంచి ఎవరో ఒకరు వస్తారని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న ఉదయం విమోచన ఉత్సవాల అనంతరం పరేడ్ గ్రౌండ్ లోనే సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. సభ ఏర్పాట్లపై గురువారం ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభను సక్సెస్ చేయాలని, భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచే ఎక్కువ మందిని తరలించడంపై నేతలు దృష్టి పెట్టారు. సిటీని ఆనుకుని ఉన్న, రైల్వే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెలీ కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు పాల్గొన్నారు.