ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇందిరా పార్క్ వద్ద ఇవాళ చేపట్టిన నిరుద్యోగ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. చీడపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
![బిజెపి ఉపవాస దీక్ష భగ్నం. 2 FB IMG 1694622313287 1](https://telanganabjpfans.com/wp-content/uploads/2023/09/FB_IMG_1694622313287-1.jpg)
![బిజెపి ఉపవాస దీక్ష భగ్నం. 3 FB IMG 1694622319567](https://telanganabjpfans.com/wp-content/uploads/2023/09/FB_IMG_1694622319567-682x1024.jpg)
![బిజెపి ఉపవాస దీక్ష భగ్నం. 4 FB IMG 1694622322133 1](https://telanganabjpfans.com/wp-content/uploads/2023/09/FB_IMG_1694622322133-1.jpg)
![బిజెపి ఉపవాస దీక్ష భగ్నం. 5 FB IMG 1694622317258](https://telanganabjpfans.com/wp-content/uploads/2023/09/FB_IMG_1694622317258-1024x683.jpg)
కాగా, ఇవాళ సా. 6 గంటల వరకే బీజేపీ దీక్షకు అనుమతి ఉందని.. దీంతో దీక్షను విరమించుకోవాలని పోలీసులు కిషన్ రెడ్డిని కోరారు. కానీ రేపటి వరకు దీక్ష చేస్తామని పోలీసులకు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీక్ష కొనసాగిస్తానని భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అయినప్పటికీ అనుమతి ఇచ్చిన సమయం అయిపోయిందని పోలీసులు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. శాంతియుతంగా దీక్ష చేస్తోన్న అడ్డుకోవడంపై బీజేపీ కార్యకర్తలు నుండిపడుతున్నారు.