telangana-bjp-will-win-over-10-lok-sabha-seats-amit-shah

తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా

Spread the love

శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని మూడోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి BJP అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ రాయగిరిలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అమిత్ షా (Amit Shah) గారు.

ఈ సందర్భంగా అమిత్ షా గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి పైగా లోక్‌సభ స్థానాలతో ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి & బుజ్జగింపు రాజకీయాలతో వారు విసిగిపోయారు.” అని అన్నారు.

ఈ ఎన్నికలు మోదీ ఇండియన్ గ్యారెంటీ వర్సెస్ రాహుల్ చైనా గ్యారెంటీకి సంబంధించినవి అని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి, అలవికాని హామీలతో తెలంగాణ రైతులను, మహిళలను, విద్యార్థులను మోసగించిన కాంగ్రెస్ అని అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనను తీవ్రంగా ఎండగట్టారు.

“తెలంగాణలోని భువనగిరిలో మోదీని మూడోసారి ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను.” అని తెలిపారు.

మీరు బూర నర్సయ్య గౌడ్ గారికి ఓటు వేస్తే అది నేరుగా నరేంద్ర మోదీ గారికి వేసినట్లేనని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినట్లేనని, బూర నర్సయ్య గౌడ్ గారికి మద్తతుగా మీరు కమలం పువ్వు గుర్తు పైన బటన్ నొక్కి వేసే మీ ప్రతి ఓటు నరేంద్ర మోదీ గారికే చెందుతుంది. బూర నర్సయ్య గౌడ్ గారి కమలం గుర్తుపై ఓటేయ్యండి – నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేయండని అమిత్ షా గారు ప్రసంగించారు.

ఈ సభలో అమిత్ షా గారి ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:

  • తెలంగాణలోని భువనగిరిలో మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకునేందుకు.
  • 2024 ఎన్నికలు రాహుల్ గాంధీ VS నరేంద్ర మోడీ ఎన్నిక.
  • ఈ ఎన్నికలు వోట్ ఫర్ జిహాద్ VS వోట్ ఫర్ డెవలప్‌మెంట్ అనే ఎన్నిక.
  • ఈ ఎన్నికలు ఒకరి కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రజల సంక్షేమానికి మధ్య జరిగే ఎన్నికలు.
  • ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ చైనా హామీకి విరుద్ధం…మోదీ జీ భారత్ హామీ
  • 2019లో తెలంగాణ మహానుభావులు మాకు 4 సీట్లు ఇచ్చారు. ఈసారి తెలంగాణలో బీజేపీ 10కి పైగా సీట్లు గెలుచుకోబోతోంది.
  • తెలంగాణలో రెండంకెల సీట్లు 400 దాటాలన్న మోదీ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి.
  • అభ్యర్థులు కూడా దొరకని దుస్థితి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి.
  • అందుకే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి సస్పెండ్ చేసిన వ్యక్తి కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థిని చేసింది.
  • తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు.
  • ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి పైగా లోక్‌సభ స్థానాలతో ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
  • కాంగ్రెస్ పార్టీ అవినీతి మరియు బుజ్జగింపు రాజకీయాలతో వారు విసిగిపోయారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *