Kishan Reddy-Etela Rajender-Bandi Snajay-Bhikshapathi

జి.కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి

Spread the love

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు. (In the presence of BJP State President, Union Minister Sri G Kishan Reddy, retired military Doctor Colonel Bikshapati from Jangaon joined the BJP).

ఈ సందర్భంగా డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు మాట్లాడుతూ తన మిలిటరీ డాక్టర్ సర్వీసులో తన వివిధ అనుభవాలను సభాముఖంగా అందరితో పంచుకున్నారు. బిజెపి ప్రభుత్వం రాకముందు, వచ్చిన తర్వాత మిలిటరీ డాక్టర్‌గా తను ఇలాంటి వ్యత్యాసాన్ని చూసింది వివరించారు. 

ఆర్టికల్ 370 రద్దుకు ముందు తర్వాత కాశ్మీర్ ఏ రకంగా ఉందో కూలంకషంగా వివరించడం జరిగింది. దాంతోపాటు మోది గారి పాలనలో ఏ  రకంగా భారత రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారిందో ఒక్క వాక్యంలో వివరించారు.  

కోవిడ్ సమయంలో మన భారత ప్రభుత్వం  ఉచితంగా వ్యాక్సినివ్వడం ద్వారా ప్రజలను ఏ విధంగా రక్షించిందో దాని ప్రభావం ఎలా ఉందో వివరించారు. 

మోదీ గారిని  శ్రీకృష్ణునితో పోల్చిన డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు.ఏ దేశ రక్షణ వ్యవస్థ బాగుండదు ఆ దేశం అధోకతి పాలవుతుందని ఈ సందర్భంగా వారు వివరించారు.