19-10-2023-Featured Image - Kishan Reddy at Press meet

జి. కిషన్ రెడ్డి గారు డిల్లీ విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు

Spread the love

కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు దేశ రాజధాని కొత్త డిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి గారి సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు:

  • బీఆర్ఎస్ కాంగ్రెస్ బీ టీమ్ కాకపోతే ఓటు కు నోటు కేసులో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎందుకు శిక్ష పడట్లేదు?
  • కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన కారణంగానే.. నాడు 1969లో.. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో వేల మంది తెలంగాణ విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
  • పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి.. తెలంగాణకోసం ఏం చేశారో చర్చించేందుకు వచ్చే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా?
  • హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వస్తారో.. ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో చర్చిస్తారో మీరే నిర్ణయించండి.. మేం సిద్ధమే.. మీరు రెడీనా? వీటన్నింటికంటే ముందు..
  • హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం ముందు ముక్కు రాసి.. తెలంగాణ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.