Screenshot 20240319 093522 Chrome

వారి అక్రమాలు బయటపెడతా

Spread the love

ఆర్థికంగా లబ్ధి పొందడానికే జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారారని మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరో పించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ నుంచి వెళ్లిన ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారని, అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి సీటిస్తే తమ పార్టీకి సిద్ధాంతం ఉంటుందని, సీటు ఇవ్వకపోతే ఉండదా అని ప్రశ్నించారు. త్వరలోనే జితేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని హెచ్చరించారు. తమ ప్రాంత ప్రజా శ్రేయస్సు కొరకు వారిద్దరూ పార్టీలు మారామని చెప్పడం నూరు శాతం అబద్ధమని, కేవలం ఆర్థి కంగా లాభ పడేందుకు మాత్రమే పార్టీ మారారని ఆరోపించారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి రెండు కంపెనీలు, అక్రమ నిర్మాణాలపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో అక్రమ నిర్మాణాలపై త్వరలో న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. ఇదే విషయంపై ఐటీ, ఈడీ అధికారులను కూడా సంప్రదిస్తామని పే ర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భం గా తనను ఎవరూ కొనలేరని చెప్పిన జితేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్కు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలని రఘునందర్ డిమాండ్ చేశారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *