aravind

ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోదీ : ఎంపీ ధర్మపురి అర్వింద్

Spread the love

ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మోదీ, భారత దేశం సురక్షింతంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలి అన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో సోమవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చే ఉచిత గ్యాస్, స్కూళ్ల నిర్మాణం, వైద్యం, షాదీమురక్కు డబ్బు, రుణాలు, ముద్ర లోన్స్ లాంటి అన్ని పథకాలకు ప్రధాని పైసలు ఇస్తున్నారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ తీసి ముస్లిం మహిళలకు ఆత్మగౌరవం తెచ్చింది.. నరేంద్ర మోడీనే అని అన్నారు. ఇలాంటి అన్ని సంక్షేమ ఫలాలు మోదీ ప్రభుత్వం ఇస్తుండగా

తెలంగాణలో కేసీఆర్ తమ పథకాలుగా చెప్పు కోవడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్రెడ్డి వంద రోజుల పాలన కేసీఆర్ పాలనకు నకలుగా తయారయిందన్నారు. సార్వత్రిక ఎన్నికలలో మోదీదే విజయం ఖాయం అయిపోయిందన్నా రు. 400 సీట్లను మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు. కేంద్రంలో సుస్థిరమైన పాలన ఉంటేనే దేశభద్ర తకు మేలని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రా ష్ట్రానికి ఎన్నోవేల కోట్లు నిధులు ఇచ్చి ఆదుకున్న మోదీని గెలిపించుకుని రుణం తీర్చుకోవాలని ధర్మపురి అర్వింద్ అన్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *